వైసీపీ పార్టీని వ్యతిరేకించే మీడియా సంస్థలలో ఒకటి ఏబీఎన్. వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడిని నైతికంగా దెబ్బతీసే విధంగా చంద్రబాబు హయాంలో ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ వ్యవహరించడం అందరికీ తెలిసిందే. దీంతో వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చాలావరకూ ఏబీఎన్ మీడియా సంస్థలు తన విలేకరుల సమావేశానికి రాకూడదని బహిరంగంగానే మీడియా ముందు వార్నింగ్ లు ఇవ్వడం గతంలో మనం చూశాం. అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా వైసీపీ పార్టీలో ఉండే కీలక నాయకులు వైయస్ జగన్ మరియు విజయసాయి రెడ్డి ఏబీఎన్ రాధాకృష్ణ గురించి మీడియా సంస్థల గురించి బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చేవారు.
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన గాని ఏబీఎన్ రాధాకృష్ణ ఎక్కడ తగ్గకుండా ఎప్పటికప్పుడూ జగన్ ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నాలు చేసే విధంగా కథనాలు ప్రచారం చేయడం జరిగింది. అటువంటిది గత కొన్ని రోజుల నుండి వైసీపీకి సపోర్ట్ చేసే విధంగా ఏబీఎన్ ఛానల్ కథనాలు ప్రసారం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో వైసిపి పార్టీకి చెందిన ముఖ్య నాయకుల వార్తలు గాని మీడియా సమావేశాలు గాని ఏబీఎన్ ఛానల్ లో ప్రసారం అయ్యేవి కావు.
అటువంటిది కొద్ది రోజులుగా చూస్తే విజయసాయి విషయంలో ఆర్కే మీడియా సంస్థల తీరు పూర్తిగా మారిపోయింది. పూర్తి మేటర్ లోకి వెళితే ఇటీవల విజయ్ సాయి రెడ్డి విశాఖపట్నంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ని భయంకరంగా విమర్శించారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని పూర్తిగా తప్పుపట్టారు. అయినా ఎక్కడా కూడా ప్రెస్ మీట్ ఆఫ్ చేయకుండా ఏబీఎన్ పూర్తిగా చూపించడం చూస్తే వైసీపీకి అన్ కండిషనల్ గా ఏబీఎన్ ఆర్కే సపోర్ట్ చేస్తున్నారా అన్న సందేహం వ్యక్తమవుతోంది.