విజయవాడ, జనవరి11: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ డైలు అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కు అప్పగించారు. ఎన్ఐ అధికారులు అతనిని శుక్రవారం విజయవాడలోని ఎన్ఐఎ కోర్టులో హాజరుపరచనున్నారు.
జగన్పై దాడి కేసు విషయంలో రాష్ట్ర పోలీసుల దర్యాప్తును విశ్వసించలేమంటూ వైఎస్ఆర్సిపి నాయకులు హైకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా కేసు దర్యాప్తును ఎన్ఐఎకు అప్పగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది.
కేసు దర్యాప్తుకు సంబంధించిన ఫైళ్లు ఇప్పటికే విజయవాడలోని ఎన్ఐఎ కోర్టుకు చేరుకున్నాయి. ఎన్ఐ దర్యాప్తును నిరసిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని గతంలో నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.