Adani : అదానీ పోర్ట్స్ లిమిటెడ్ కృష్ణపట్నం పోర్టు మొత్తం స్వాధీనం చేసుకుంది. ప్రారంభంలో 75 శాతం వాటాలను కొనుగోలు చేయగా తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కూడా విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఈ పరిణామంతో కృష్ణపట్నం పోర్ట్ మొత్తం అదానీ గ్రూప్ సంస్థలు చేజిక్కించుకున్నటు అయింది.
గత ఏడాది 75 శాతం వాటాను కొనుగోలు చేయగా తాజాగా 25 శాతం వాటా విలువ 2800 కోట్లకు చేజిక్కించుకోవడం జరిగింది. ఏపీలో నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ పోర్ట్ ఏపీ- తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఓడ రేవు కేంద్రంగా 2025 నాటికి ప్రణాళికాబద్ధంగా బహుళ-ఉత్పత్తి మరియు కార్గో మెరుగుదల వ్యూహం ద్వారా అధిక వృద్ధి పై అదానీ పోర్ట్స్ లిమిటెడ్ దృష్టి సారించడం జరిగింది.