2014 ఎన్నికలలో వైసిపి పార్టీ తరుపున గెలిచి ఆ తర్వాత టీడీపీ పార్టీ లోకి వెళ్ళిన కడప నేత ఆదినారాయణ రెడ్డి కి చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వటం తెలిసిందే. తర్వాత జరిగిన 2019 ఎన్నికలలో ఘోరంగా టిడిపి, తాను ఓడిపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆదినారాయణరెడ్డి కి తాజాగా హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు ఉన్న 1+1 భద్రతను తొలగించాలని సమర్థిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించింది.
ప్రాణహాని లేనప్పుడు సెక్యూరిటీ ఎందుకని న్యాయస్థానం ప్రశ్నించి, భద్రతను కల్పించాల్సిన అవసరం లేదని ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తనకు భద్రత పునరుద్ధరించాలని ఆదినారాయణరెడ్డి దాఖలుచేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితా లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.