ఢిల్లీ: బిజెపి మేనిఫెస్టోపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల అకాంక్షలను ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉండగా బిజెపి హమీ పత్రం అహంకారపూరితంగా ఉందని మంగళవారం ఉదయం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ మేనిఫెస్టోను విస్తత చర్చల ద్వారా రూపొందించాం. దాదాపు పది లక్షల మంది భారతీయుల గళమే మ మేనిఫెస్టో. అది తెలివితో రూపొందించిన ఒక శక్తివంతమైన హామీ పత్రం’ అని పేర్కొంటూ బిజెపి మేనిఫెస్టోపై విమర్శలు సంధించారు.
‘బిజెపి మేనిఫెస్టోను ఒక గదిలో రూపొందించారు. అది అహంకారపూరితంగా ఉంది. హ్రస్వ దృష్టితో రూపకల్పన చేసిన ఈ మేనిఫెస్టో కేవలం ఒక ఒంటరి వ్యక్తిగతాన్ని మాత్రమే వినిపిస్తుంది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి బిజెపి సంకల్ప్ పత్రంపేరుతో మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోది, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా, కేంద్ర మంత్రి రాజ్నాధ్ సింగ్లు బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.