కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ రాజకీయం హాట్ హాట్ గా మారింది. భూమా,ఏవీ కుటుంబాల మధ్య రాజకీయ వైర్యం రోజురోజుకి ముడురుతున్నది. తన హత్యకు మాజీ మంత్రి అఖిలప్రియ సుపారీ ఇచ్చిందంటూ టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలను కొట్టిపారేస్తూ అఖిల ప్రియ ఆయనపై విమర్శలు చేసిన విషయాలు తెలిసిందే. వారి మధ్య మాటల తూటాలు పెలుతుండగానే మరో పక్క ఏవి సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి అఖిల ప్రియ పై తీవ్ర విమర్శలు చేశారు.
అఖిల ప్రియపై పోటీకి సిద్దం
ఆళ్ళగడ్డలో అఖిలప్రియపై పోటీకి సిద్ధమని ప్రకటించింది జస్వంతి. తమదీ ఆళ్ళగడ్డనే, అక్కడే రాజకీయం చేస్తామని ఆమె అన్నారు. అఖిల ప్రియను అక్కా అని పిలవాలంటే అసహ్యం వేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేవుడు ఇచ్చిన మామను దేవుడి దగ్గరకు పంపాలని అఖిలప్రియ కుట్ర చేసిందని అఖిలప్రియ పై జస్వంతి సంచలన ఆరోపణలు చేసింది. తండ్రి లేని అఖిలప్రియకు తండ్రి విలువ తెలియదనుకోననీ, ఆడపిల్లగా నాన్న లేని పరిస్థితి ఊహించుకుంటేనే భయంగా ఉందనీ అన్నారు. కష్ట పడకుండా మంత్రి పదవి పొందిన అఖిలప్రియకు కష్టం విలువ తెలియదని విమర్శించారు. భూమా దంపతులు, ఏవీ సుబ్బారెడ్డి 30 ఏళ్ళ కష్టం వలనే అఖిల ప్రియకు ఆ స్థాయి దక్కిందని పేర్కొన్నారు. అఖిలది క్రిమినల్ మైండ్, ఆమె తీరు మహిళలకే సిగ్గుచేటని అన్నారు. తన తండ్రి ప్రాణం ఖరీదు రూ.50 లక్షలా అని ప్రశ్నించింది.
అఖిలతో రాజీ ప్రసక్తే లేదు
మరో పక్క ఈ కుటుంబాల మధ్య సయోధ్య కుదర్చడానికి టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చావడానికి అయిన సిద్దమే కానీ అఖిలప్రియతో మాత్రం రాజీపడే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు ఏవి సుబ్బారెడ్డి. టీడీపీ నాయకత్వం చెప్పినా కూడా మళ్లీ అఖిల ప్రియతో మాత్రం కలిసి పనిచేయనని స్పష్టం చేశారు. 35 ఏళ్లుగా ఫ్యాక్షన్ రాజకీయాలలో ఉన్న తనకు ప్రాణ భయం లేదనీ, ఎవరి గురించి భయపడాల్సిన పనిలేదనీ, అఖిలప్రియ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ ను వదిలేశాను కాబట్టే ఒంటరిగా తిరుగుతున్నా, ఆళ్లగడ్డలో తప్పకుండా రాజకీయం చేస్తానని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?