రాజమండ్రి అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరటం ఖాయమైంది. బుధవారం రాత్రి ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తాను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 21వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు ఆకుల స్పష్టం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందనీ, ప్రధానంగా విశాఖ రైల్వే జోన్ దుగరాజపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంట్ మంజూరు చేయకుండా అన్యాయం చేసిందని ఆకుల అన్నారు.
ఎలాంటి షరతులు లేకుండా నే తాను జనసేన పార్టీలో చేరుతున్నాననీ, ఏ పదవి ఇచ్చిన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆకుల తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?