Corona: దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఊహించిన విధంగా వైరస్ విస్తరించి ఉండటం తో… రోజు రోజుకి కేసులు పెరిగిపోతుండటంతో.. వైద్యం సకాలంలో చాలామందికి అందక.. ప్రాణాలు విడుస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ… ప్రజలను అప్రమత్తం చేస్తూ లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు చేస్తూ ఉన్నాయి. అయినా కానీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో… కరోనా నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తూ ఉండటంతో.. కరోనా వైరస్ తన పని తాను చేసుకుంటూ పోతుంది.
దీంతో దేశంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. ఎవ్వరూ కూడా చావుని తప్పించుకోలేక పోతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ… దేశ జనాభా భారీగా ఉండటంతో… కరోనా కంట్రోల్ కాని పరిస్థితి. ఇదిలా ఉంటే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో పరిస్థితి మరో మహారాష్ట్ర గా మారేటట్లు కనిపిస్తుంది. భయంకరంగా కేసులు పెరిగిపోవటం మాత్రమే కాక ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చాలా శవాలు గంగానదిలో… తేలుతూ ఉండటంతో… ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చేసినా గాని నగరాలు మరియు పట్టణాలు తో పాటు ఇప్పుడు గ్రామాల్లోకి వైరస్ విస్తరించి పోయింది.
దీంతో గ్రామాల్లో అంతంతమాత్రంగానే వైద్య సదుపాయాలు ఉండటంతో… తాజాగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇంకా ఆ భగవంతుడే కాపాడాలి అని పేర్కొంది. ఇటీవల కరోనా పేషెంట్ లకు సరైన చికిత్స అందించాలని… దాఖలైన పిటిషన్ పై విచారణ చేసిన సమయంలో ఈ కామెంట్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.