ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో ప్రతిసారి టిఆర్ఎస్ పార్టీ యే గెలుస్తూ వస్తోంది. ప్రత్యేక తెలంగాణ సాధించడంతో కేసీఆర్ రాష్ట్ర ప్రజలలో చెరగని ముద్రవేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా కేసీఆర్ తనదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను టిఆర్ఎస్ పార్టీ వైపు మల్లించటంలో ఆయన వ్యవహరించే తీరు ప్రత్యర్థులను చిక్కుల్లో నెట్టేస్తోంది. అటువంటిది తాజాగా దుబ్బాక ఉప ఎన్నికలు మరియు గ్రేటర్ ఎన్నికల విషయంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా కరోనా వైరస్ కంట్రోల్ చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలం అయినట్లు విపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటూ పోతున్నాయి. ఇదే తరుణంలో దీటైన జవాబు ఇవ్వటంలో కౌంటర్లు చెప్పడంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు విఫలమవుతున్నట్లు టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఇటీవల గుర్తించడం జరిగిందట. చాలావరకూ ఈ ఎన్నికల బాధ్యతలను పార్టీలో ఉన్న కీలక నాయకుల పై కేసిఆర్ పెట్టడం జరిగిందట. కానీ వారు సరైన రీతిలో పార్టీని నడిపించలేని పరిస్థితి తాజాగా ఏర్పడినట్లు కేసిఆర్ గుర్తించడం జరిగింది అని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో టాక్.
దీంతో జరగబోయే ఎన్నికల ప్రచారంలో అత్యవసరంగా రంగంలోకి కేసిఆర్ దిగబోతున్నట్లు టాక్. ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో వైరల్ అవుతున్న తో టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. అంతకుముందు జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ఊహించని రీతిలో పుంజుకోవడంతో ఈ ఎన్నికలలో పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. మరోపక్క కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటానికి ప్లాన్స్ వేస్తున్నట్లు టాక్. దీంతో ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదని నేరుగా ఈ ఎన్నికలను కేసీఆర్ డీల్ చేయటానికి రెడీ అయినట్లు సమాచారం.