హైదరాబాదు, ఫిబ్రవరి 18: తెలుగుదేశం పార్టీకి అమలాపురం పార్లమెంట్ సభ్యుడు రవీంద్రబాబు షాక్ ఇచ్చారు. రవీంద్రబాబు సోమవారం హైదరాబాదులో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు.
చీరల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్తో కలిసి రవీంద్రబాబు సోమవారం జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. జగన్మోహనరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వనించారు.
కొద్ది రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీకి చెందిన మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఆవంతి శ్రీనివాస్లు వైసిపిలో చేరారు. ఇప్పుడు తాజాగా ఎంపి రవీంద్రబాబు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీలో కులతత్వం బాగా ఉందనీ, దళితుడిని కావడం వల్లనే తనను తొక్కిపట్టారని రవీంద్రబాబు అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఒక్క సామాజికవర్గం తప్ప మిగిలిన అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి కుంటుపడిందని రవీంద్రబాబు పేర్కొన్నారు.
జగన్మోహనరెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం లేదని, అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతిని అడ్డుకుంటున్నారని రవీంద్రబాబు అన్నారు. జగన్మోహనరెడ్డి నీతి నిజాయితీగా వ్యవహరిస్తున్నారనీ, ప్రత్యేక హోదాపై మొదటి నుండి మాట తప్పకుండా పోరాడుతుందని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డేనని రవీంద్రబాబు స్పష్టం చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?