ఏపీ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ గందరగోళానికి గురి చేస్తున్నట్టు గానే వ్యవహరిస్తుంది. మొదటి నుండి అమరావతి కి అనుకూలం అంటూనే …. రాజధాని అమరావతి రైతులు చేసిన ఉద్యమానికి సై అంటే సై అన్న బిజెపి ఎప్పుడూ తన అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టినట్లు అర్థమవుతుంది. కన్నా లక్ష్మీనారాయణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న టైంలో అమరావతి రాజధాని కి సంబంధించి బిజెపి పార్టీ పూర్తిగా అనుకూలంగా ఉన్నట్లు పరిస్థితులు అనిపించాయి. కానీ ఎప్పుడైతే కన్నా లక్ష్మీనారాయణ సైడ్ అయ్యారో, సీన్ లోకి సోము వీర్రాజు వచ్చారో లెక్కలు తారుమారయ్యాయి.
అమరావతికి అనుకూలం అంటూనే, మరోపక్క ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని సోము వీర్రాజు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అమరావతికి అనుకూలంగా బిజెపి లో ప్రస్తుతం మాట్లాడే నాయకులను రాష్ట్ర బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేస్తూ వ్యహరిస్తుంది. మొన్న మూడు రాజధానుల విషయంలో బిజెపి పార్టీ నాయకుడు రమణ ఎడిటోరియల్ రాశారని పార్టీ నుండి సస్పెండ్ చేయగా, తాజాగా అదే పార్టీకి చెందిన వెలగపూడి గోపాలకృష్ణ ని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది.
రాజధాని ఏర్పాటుతో సంబంధం లేదని కేంద్రం అఫిడవిట్ లో తెలపడం భావ్యం కాదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేనప్పుడు… వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు అని వెలగపూడి గోపాలకృష్ణ ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నుండి రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే బీజేపీ అధిష్టానం వెలగపూడి రామకృష్ణ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది.
సో దీన్ని బట్టి చూస్తే పైపైకి అమరావతి కి అనుకూలంగా అంటూనే… లోలోపల మాత్రం బిజెపి వ్యతిరేకంగా ఉందని ప్రస్తుత పరిణామాలను బట్టి ఇది క్లియర్ గా కనబడుతోంది అంటూ మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అమరావతికి అనుకూలంగా బిజెపి ఉండబట్టే పొత్తు పెట్టుకునట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరించడం జరిగింది. మరి తాజా పరిణామాలను బట్టి పవన్ రాబోయే రోజుల్లో బీజేపీతో ఎలా మెలుగుతారు అన్నది సస్పెన్స్ గా మారింది.