గుంటూరు: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందకు గుంటూరులో అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనను తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ అయన వాహనానికి అడ్డంగా వెళ్లారు. యాగాలు చేసి జగన్ను గెలిపించినట్లే అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చేయాలని కోరారు. పోలీసులు, వైసీపీ కార్యకర్తలు కలగజేసుకొని ఆయన వాహనానికి దారిచ్చారు.
previous post
next post