రాజకీయాలలో ముందు నుండి వైయస్ జగన్ కి అండగా ఉన్న వారిలో ఒకరు అంబటి రాంబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ విభజన జరిగిన తర్వాత గాని వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉంటూ ప్రత్యర్థులపై మీడియా సమావేశాల్లో తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ ఉంటారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికలలో సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై స్వల్ప మెజార్టీతో గెలిచిన అంబటి రాంబాబుపై ప్రస్తుతం సొంత నియోజకవర్గం వైసీపీ నేతలలో అసంతృప్తి నెలకొని ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం చూస్తే అంబటి రాంబాబు బంధువు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను…. కాంట్రాక్టులను నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా ఎక్కడో బయటవాళ్ళకి అపచెబుతున్నట్లు టాక్.
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఉన్న వైసిపి నేతలంతా అంబటి రాంబాబు వర్గంపై సీరియస్ గా ఉన్నట్లు మీడియా సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా ఈ విషయం ఇటీవల జగన్ దృష్టి దాకా వెళ్ళటం జరిగిందట. వెంటనే సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కేడర్ లో జరుగుతున్న పరిణామాలన్నింటినీ రహస్యంగా ఓ నివేదిక రూపంలో తెలుసుకున్నారట. ఇదంతా బూటకమని కావాలని అంబటి రాంబాబుపై కొంతమంది చెడు ప్రచారం చేస్తున్నారని తేలిందట. కాగా వచ్చిన వార్తపై మీడియా సమావేశంలో తనదైన శైలిలో ఇటీవల వివరణ ఇవ్వటం జరిగింది. కావాలని కొన్ని రాజకీయ అరాచక శక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు కడిగిపారేశారు. ఇదంతా కుట్ర అంటూ తేల్చి పారేశారు.
ఇటీవల చాలా నియోజకవర్గాలలో అనేక మంది ఎమ్మెల్యేల గురించి బ్యాడ్ న్యూస్ లు వింటున్న జగన్ కి సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు విషయంలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలటం నిజంగా ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మరోపక్క తన పై నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు న్యాయస్థానంలో కొంత మంది హైకోర్టు లో వేసిన పిటిషన్లను పై… . అంబటి రాంబాబు స్పందిస్తూ అది కోర్టులో ఉన్న విషయమని కాబట్టి ఇప్పుడప్పుడే స్పందించేది లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయస్థానంలోనే తేల్చుకుని అక్రమ మైనింగ్ విషయములో అధ్యక్షుడి దగ్గర తన నిజాయితీని నిరూపించుకుంటా అని అంబటి రాంబాబు అంటున్నట్లు టాక్.