Mask: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ అనేక దేశాల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం తెలిసిందే. చైనా దేశంలో 2019 వ సంవత్సరంలో నవంబర్ మాసంలో బయటపడ్డ ఈ వైరస్.. రెండు సంవత్సరాల వ్యవధిలో భూమి మీద ఉన్న ప్రతి మానవుడిని షేక్ చేసి పడేసి.. భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. అయితే ఈ వైరస్ ని జయించటం కోసం అనేక దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ లు అందుబాటులోకి తీసుకురావడం తెలిసిందే. అయితే చాలా దేశాలలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం.. చాలా స్లోగా జరుగుతుంది.
దాదాపు ప్రపంచంలోని చాలా దేశాలలో మాస్కు తప్పనిసరి అంటూ ప్రభుత్వాలు ఇంకా నిబంధనలు కొనసాగిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా.. ప్రపంచంలో భూమిమీద మొట్టమొదటిసారి మాస్క్ లేకుండా.. స్వేచ్ఛగా తిరగవచ్చు అంటూ.. దేశ పౌరులకు అధికారికంగా ప్రకటించిన మొట్టమొదటి ఇజ్రాయెల్ దేశం అని అందరికీ తెలుసు. ఇజ్రాయెల్ దేశంలో… దాదాపు 80 శాతం వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అతి తక్కువ టైమ్ లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.
కోటి మంది జనాభా కలిగిన దేశం కావడంతో ప్రతి ఒక్కరికి .. అతి తక్కువ టైమ్ లోనే వ్యాక్సిన్ అందించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే జాబితాలో కి అగ్రరాజ్యం అమెరికా కూడా చేరింది. కరోనా వైరస్ చైనా నుండి బయటకు వచ్చిన ప్రారంభంలో ఎక్కువ ప్రభావం మరియు నష్టపోయిన దేశం అమెరికా. అయితే ఏది ఏమైనా గానీ అమెరికా మాత్రం తర్వాత జాగ్రత్తలు తీసుకుని వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందించి .. దాదాపు కరోనాను జయించి.. మాస్క్ ఫ్రీ దేశంగా తాజాగా నిలిచింది. ఇటీవల అమెరికా దేశానికి చెందిన అధికారులు కూడా.. దేశంలో పౌరులకు మాస్క్ అవసరం లేదు అని ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…
ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…
బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్ అంతటా పెంచేందుకు కరణ్…
ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. "బాహుబలి 2", "RRR" సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు…