అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. అధికార రిపబ్లిక్ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ల మధ్య మాటల తూటాలు నువ్వానేనా అన్నట్టుగా ఉన్నాయి. తాజాగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కమలా హరీష్…. ట్రంపు వైఫల్యం కారణంగానే అమెరికాలో మహమ్మారి వైరస్ ఉందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో శుక్రవారం మీడియాతో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ కమలా హరీష్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేశారు. కమలా హరీష్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ కంటే చాలా డేంజరస్ మహిళ అని, ఆమె భారత సంతతికి చెందిన వ్యక్తి అంటూ నొక్కి చెప్పారు. అంతేకాకుండా శ్వేత సౌధానికి పని చేసే అర్హత కమలా హరీష్ కి లేదు అన్నట్టుగా ట్రంపు వ్యాఖ్యలు చేశారు.
జో బీడెన్ అధ్యక్షుడు అయితే అధికారంలోకి రావడమే పోలీస్ విభాగాన్ని అరికట్టడానికి సరికొత్త చట్టాన్ని ఆమోదిస్తారు అంటూ.. మాట్లాడుతూనే కమలా ఇంకా అధ్వానంగా ఉంది, ఆమె భారతీయ వారసత్వానికి చెందినది. ఆమెకంటే దేశంలో భారతీయుల మద్దతు తనకే ఎక్కువగా ఉంటుందని ట్రంప్ చాలా ధీమాగా చెప్పుకొచ్చారు. ఒకవేళ బిడెన్ అమెరికా అధ్యక్షుడైతే అది దేశానికి ఎంతో చెడు అని ఘాటు విమర్శలు చేశారు.
పరిస్థితి ఇలా ఉండగా ఎక్కువ శాతం భారత ప్రధాని, కమలం పార్టీ నాయకుడు మోడీ సపోర్ట్ కచ్చితంగా తనవైపే ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రంప్. మరోపక్క డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్ కమలా హారిస్ ని ఈ ఏడాది నవంబర్ మూడవ తారీకున జరగబోయే యుఎస్ ఎన్నికలకు తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు.