అమేఠీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీలో దాఖలు చేసిన నామినేషన్ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిటర్నింగ్ అధికారి రాంమనోహర్ మిశ్రా రాహుల్ నామినేషన్ పత్రాల తనిఖీని ఈ నెల 22 కు వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.
రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంలో అనేక అనుమానాలున్నాయంటూ స్వతంత్ర అభ్యర్థి ధృవ్ లాల్ చేసిన ఫిర్యదు మేరకు ఎన్నికల అధికారి ఈ ఆదేశాలిచ్చారు.
దీనిపై లాల్ తరుపు న్యాయవాది రవిప్రకాష్ మాట్లాడుతూ…’మేం ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తాం. బ్రిటన్లో రిజిస్టర్ అయిన ఒక కంపెనీ ప్రకారం రాహుల్ గాంధీ ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయులు కాని పౌరులకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదు. ఏ ప్రాతిపదికన రాహల్ గాంధీ బ్రిటన్ పౌరుడయ్యారు? ఇప్పుడు భారతీయుడు ఎలా అయ్యారు? దీనిపై స్పష్టత వచ్చే వరకు రాహుల్ గాంధీ నామినేషన్ను ఆమోదించకూడదని రిటర్నింగ్ అధికారిని కోరాం’ అని తెలిపారు. బ్రిటన్ కంపెనీకి సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని రవిప్రకాశ్ ఆరోపించారు.
అలాగే విద్యార్హత పత్రాల్లోనూ తప్పులున్నాయని ఫిర్యాదు చేశారు. కాలేజీలో ఆయన పేరు ‘రౌల్ విన్సీ’ అని ఉందనీ, రాహుల్ గాంధీ పేరిట ఒక్క సర్టిఫికెట్ కూడా లేదనీ రవిప్రకాశ్ వివరించారు. అందుకే, రాహుల్ గాంధీ, రౌల్ విన్సీ ఒక్కరేనా అనేది తేల్చుకోవాలనుకుంటున్నామని రవిప్రకాశ్ పేర్కొన్నారు. ఒకవేళ కాకుంటే రాహుల్ గాంధీ ఒరిజినల్ సర్టిఫికెట్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Ravi Prakash, lawyer of independent MP candidate from Amethi, Dhruv Lal who has raised objections on Rahul Gandhi's nomination papers: On basis of certificate of incorporation of a company registered in UK, he declared himself a UK citizen. A non-citizen can't contest polls here. pic.twitter.com/A8ifZgbGhC
— ANI UP (@ANINewsUP) April 20, 2019