అమరావతి, ఏప్రిల్ 22: అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలను రద్దుచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎన్నికల కమిషన్ ను కోరారు.
ఆయా నియోజకవర్గాల ఎన్నికలలో తన కుమారుల కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టమని టిడిపి నేత జెసి దివాకరరెడ్డి స్వయంగా చెప్పారని రామకృష్ణ అన్నారు. ఓటుకు రెండు వేలు పంచామని చెప్పారని రామకృష్ణ పేర్కొన్నారు.
కోట్లాది రూపాయలు అనైతికంగా వెదజల్లడం ఎన్నికల నిబంధనలకు విరుద్దమనీ, గత 30 ఏళ్లకుపైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, జెసీ లాంటివారు రాజకీయాలను దిగజార్చారని రామకృష్ణ ఆరోపించారు.
జెసి వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సుమోటోగా స్వీకరించి, తక్షణమే అనంతపురం పార్లమెంట్, తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని రామకృష్ణ కోరారు.