ఏపీ రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బెజవాడలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమార్కులకు పాల్పడే ముఠాలు దండయాత్ర లు చేస్తూనే ఉన్నాయి. డ్రగ్స్, గంజాయి ముఠాలే కాకుండా స్పాలా ముసుగులో వ్యభిచార దందా నిర్వహించే వారు ఎక్కువయ్యారు. విభజన జరిగిన తర్వాత ఐదేళ్ళ కాలంలో చిన్నా పెద్దా కలిపి విజయవాడ పరిధిలో 200కు పైగా స్పాలు ఏర్పాటయ్యాయి. ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ, దేశ విదేశాలకు చెందిన యువతులే ప్రధాన ఆకర్షణగా వ్యాపారం సాగిస్తున్నాయి. ఒక్కసారి ఈ స్పాలలో అడుగుపెడితే క్రాస్ మసాజ్ పేరిట వ్యభిచారం జరిగిస్తున్నట్లు పలుమార్లు పోలీసుల దాడుల్లో గుర్తించారు.
అయితే ఒక పక్క పోలీసులు దాడులు చేస్తున్నా స్పాలలో ఈ దందా కొనసాగుతుండటం పోలీసు వర్గాల లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్ఫాల పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసినప్పుడు బ్యాంకాక్ మరియు థాయిలాండ్ దేశాలకు చెందిన యువతులను గుర్తించారు. స్టడీ వీసాలపై దేశం లోకి వచ్చిన వీరంతా వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్నట్లు విచారణలో బయట పడింది. పలుమార్లు ఇలా స్పాలపై దాడులు చేసిన మళ్లీ ఆ స్పాలు వేరే పేరు పై ఓపెన్ అయిపోతున్నాయి. ఇదిలా ఉండగా నగరానికి కి కొత్త పోలీస్ కమిషనర్ ఎవరు వచ్చినా స్పా లపై దాడులు జరుగుతాయి. ఆ తరువాత వాటి పై పోలీసులు చూడరు అని అంటారు.
కారణం నగరంలో జరిగే ఈ తరహా దందాకు కమిషనర్ ఇంట్లో పనిచేసే ఓ కాకి ఆఫీసర్ అండగా ఉంటున్నట్లు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మొత్తం వ్యవహారాన్ని ఆయనే చూస్తారట. ఆ కాకి బాస్ వల్ల నగరంలో ఇటువంటి విషయాలపై చాలా మంది పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని టాక్. బందరు రోడ్డు, పటమట, మొగల్రాజపురం, మాచవరం… ఇంకా నగరంలో కొన్ని ప్రాంతాలలో స్పాల పేర్ల పై జరిగే వ్యభిచార వ్యాపారం పై ఎటువంటి దాడి జరగకుండా ఈ కాకి పోలీస్ ఆఫీసర్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాకి ఆఫీసర్ కి నేరుగా చేతికి మట్టి అంటకుండా స్పా వ్యవహారాలను చూసే ఓ మహిళ అన్నిటినీ మోనిటర్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసుల దాడులకు సంబంధించి ఈ మహిళ ద్వారానే ముందస్తుగానే సమాచారం చేరి పోతుందట. కేవలం పోలీసులు ఆ మహిళ యే కాకుండా కొందరు రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.