Andhra Pradesh : ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ పదవీకాలం ఈ నెలాఖరున పూర్తికానున్న నేపథ్యంలో .. ఆ స్థానానికి ముగ్గురిని ఎంపిక చేస్తూ వారిలో ఒకరికి అవకాశం ఇప్పించాలని గవర్నర్ కి ఏపీ ప్రభుత్వం మూడు పేర్లు సూచించింది.
ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, ప్రేమ్ చంద్ రెడ్డి మరియు శామ్యూల్ పేర్లను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ముగ్గురిలో ఒకరికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలు అప్పజెప్పాలని పేర్కొంది. మరి ఈ ముగ్గురిలో ఎవరికీ గవర్నర్ అవకాశం ఇస్తారో అన్నది చూడాలి. ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో నియమించడం జరిగింది.
కాగా నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తీసుకున్న చాలా నిర్ణయాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం మనకందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఆయన పదవీ బాధ్యతలు ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరు ఇప్పుడు నియమితులు అవుతారు అన్నది ఉత్కంఠగా మారింది.