ఆంధ్రప్రదేశ్ లో కీలక మార్పులకు గవర్నర్ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లుతో శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఇకపై ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అన్నది అధికారికమైంది. అయితే అంతకంటే ముందే ఏపీలో మరిన్ని కీలక మార్పులు జరగనున్నాయి.
రాష్ట్రంలో నాలుగు జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా ఈ జోన్లు ఏర్పాటు కానున్నాయి. బోర్డు పరిధిలో చైర్మన్ తో పాటు ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ బోర్డు చైర్మన్ తో క్యాబినెట్ స్థాయి హోదా కల్పించనున్నారు.
దీని ప్రకారంగా అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకూ అందుతాయని అంటున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం అమరావతి మెట్రో పాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ జోన్ల మార్పు తర్వాతే రాజధాని మార్పు ఉంటుందని తెలుస్తోంది.