ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ పార్టీపై ఆ పార్టీ కీలక నేతల పై పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత కొన్నాళ్ల నుండి కొంతమంది రాజకీయ నేతలు ఇంట్లో నుండి అడుగు బయట పెట్టకుండా పని చేస్తున్న ప్రభుత్వం పై చౌకబారు విమర్శలు రాజకీయాలు చేస్తున్నారని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. చెప్పినట్టు రాసే పేపర్ లు చూపించు చానల్స్ ఉన్నాయి కదా అని రెచ్చిపోతూ చౌకబారు రాజకీయాలు చేయటం మానుకోవాలి అంటూ ఇండైరెక్టుగా చంద్రబాబుకి కౌంటర్లు వేశారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో ప్రజల మధ్య శాంతిభద్రతలు దెబ్బతినేలా అపోహలు, భయభ్రాంతులు కలిగే రీతిలో తన అనుకూల మీడియా ఛానల్స్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా నెల్లూరు నగరంలో పర్యటించిన నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంకా మాట్లాడుతూ గతంలో టిడిపి పాలనలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పుకొచ్చారు.
అదే సమయంలో త్వరలోనే నగరంలో ట్రాఫిక్ సమస్య తీరనుందని..అందుకు సంబంధించి కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అద్భుత రీతిలో కులాలకు, మతాలకు, పార్టీలకతీతంగా అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది అంటూ కొనియాడారు.