ఒకానొక సమయంలో అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించిన జెసి బ్రదర్స్ పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ఈ ఇద్దరూ, విభజన జరిగిన తర్వాత టిడిపి కండువా కప్పుకోవడం జరిగింది. అయితే ఆ సమయంలో జెసి బ్రదర్స్ జగన్ ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడంతో జేసీ బ్రదర్స్ కి గడ్డుకాలం నెలకొంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్ధికంగా ఆ కుటుంబాన్నికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్రదర్స్ ట్రావెల్స్ వ్యాపారంలో దిట్ట అని అందరికీ తెలుసు.
ఈ వ్యాపారం చేసే చాలా వరకు డబ్బు సంపాదించడం జరిగింది. కాగా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక జేసీ బ్రదర్స్ అప్పట్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వాహనాల విషయం బయటపడటం జరిగింది. దీంతో కేసు నమోదుచేసి జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. కడప జైలు లో ఉన్న వీళ్లకు అప్పట్లో బెయిల్ రావడం కోసం నానా తిప్పలు పడ్డారు. ఎలాగో అలాగా బెయిల్ వచ్చిన గాని, బయటకు వచ్చాక పోలీసు నిబంధనలను ఉల్లంఘించి భారీ ర్యాలీ చేయడంతో పాటు పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మరోసారి అరెస్టయ్యారు.
ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా ప్రభావానికి గురవటం తో తాడిపత్రిలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో జెసి అనుచరవర్గం ఆసుపత్రి వద్దకు రావడంతో పాటు ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. అయితే కరోనా నిబంధనలను ఉల్లంఘించి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించడంతో తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి పై మరియు ఆయన కుమారుడు పై అదేవిధంగా వాళ్ల అనుచరుల పై కేసులు నమోదు చేశారు. దీంతో మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా వరుస కేసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి రాబోయే రోజులో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.