చట్టం ఎక్కడైనా ఒక్కటే కదా…! న్యాయం ఎక్కడైనా ఒక్కటే కదా.., రాజ్యాంగం, ఆర్టికల్లు ఎక్కడైనా ఒక్కటే కదా…! మరి ఈ విషయం జగన్ ఎందుకు గుర్తెరగడం లేదు…! ఒక్క క్లాజు, ఒక్క పాయింటుని పట్టుకుని కోర్టుల్లో కేసులు వేస్తే నిలబడతాయా…?? ఇలా ఎన్ని కేసుల్లో ఎన్నిసార్లు కోర్టులు మార్చిన జగన్ అనుకున్నది జరగదు, అందుకే మార్చాల్సింది కోర్టులు కాదు, సీఎం జగనే.., ఆయన మెదడే మారాలి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం అంటే “నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది” ఈ మేరకు తాజాగా బుధవారం మధ్యాహ్నం వెల్లడించింది. పూర్తిస్థాయి విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. అంటే ఒకరకంగా హైకోర్టు తీర్పే, సుప్రీం లో కూడా రాబోతుంది. జగన్ కి ఇదీ గట్టి దెబ్బ.
హైకోర్టు చాలా… సుప్రీం రెండు…!
ఇప్పటికే ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి చాల ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రభుత్వ పెద్దలు దాదాపు 70 వరకు దెబ్బలు తిన్నారు. వీటిలో కొన్ని కేసులను సుప్రీం కి వెళ్లారు. అక్కడ కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పులే సబబని తేలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగుల వ్యవహారంలో గత నెలలోనే సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం సమర్ధించింది. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలోనూ ఇదే జరుగుతుంది. ఏమో ఇక మిగిలి ఉన్న ఇంగ్లిష్ మీడియం వ్యవహారం లోనూ అదే జరుగుతుందేమో చెప్పలేం. ఇవన్నీ జగన్ కి పాఠాలే. కానీ నేర్చుకోవడం లేదు. వచ్చిన పాఠాలని పక్కన పెట్టేసి జగన్ కొత్త తప్పులకు దారి వెతుకుతున్నారు.
ఇదే సరైన పరిష్కారం…!
కోర్టులు మారవు. ఎందుకంటే అందులో ఉన్న న్యాయ పాయింట్లు, ఆర్టికల్లు, చట్టాలు వాటికి తెలుసు. అందుకే జగనే మారాలి. జగన్ ఆలోచనలే మారాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు “తనకు తోచినట్టు.., తాను అనుకున్న నిర్ణయం అమలు చేయకుండా..” చట్టంలో ఉన్న పాయింట్లులో తనకు అనుకూలమైనవి తీసుకుని అమలుకు పూనుకుంటే కొంత ప్రయోజనం ఉండవచ్చు. లేకుంటే హైకోర్టులో సెంచరీలు.., సుప్రీంలో అర్ధ సెంచరీలు తప్పవు. నయన నిపుణులు ఉండాలి, ఐఏఎస్ వంటి మేధావులు ఉండాలి… వారి మాటని జగన్ వినాలి, సమీక్షించాలి. అప్పుడే ఢిల్లీ స్థాయి కోర్టుల్లో అయినా పరువు దక్కుతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?