ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా బారిన పడ్డాడు అని వార్తలు వచ్చిన అనంతరం ఇప్పుడు మరొక వైసీపీ ఎమ్మెల్యే కి ఈ వైరస్ సోకడం కలకలం రేపుతోంది.
తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అంబటిని కలిసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు అతని కూడా ఉండే వారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు.
ఇక విజయసాయిరెడ్డి తో పాటు అతని పీఏ కి కూడా కరోనా సోకింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సాయిరెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఏపీలో ఎంతో మంది ఎమ్మెల్యేలకు మరియు వారి బంధువులకు కరోనా సోకిన తర్వాత కూడా రాంబాబు దాని బారిన పడడం కరుణ వైరస్ రాష్ట్రంలో ఎలా వ్యాపించి ఉందో అర్థం చేసుకోవచ్చు.