Nimmagadda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మగడ్డ వర్సెస్ వైసిపి వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది మార్చి నుండి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మేటర్ లోకి వెళ్తే తాజాగా నిమ్మగడ్డకు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేయడం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు ..వివరణ ఇవ్వాలని..విచారణకు హాజరు కావాలని తాజాగా నిమ్మగడ్డకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేయడం జరిగింది.
మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గా వ్యవహరిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని హౌస్ అరెస్టు చేయాలని మీడియా ముందుకు రాకూడదు అంటూ నిమ్మగడ్డ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో తన విధులకు భంగం కలిగిస్తున్నట్లు మంత్రి నిమ్మగడ్డ పై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇలాంటి తరుణంలో నోటీసులు ఇంకా రాని పరిస్థితి ఉన్న టైంలో ఈనెల 19 నుంచి 22 వరకు సెలవు కావాలని ఇటీవల గవర్నర్ నీ కోరడం జరిగింది. మరోపక్క ఈ నెలాఖరుతో నిమ్మగడ్డ పదవి కాలం ముగియనుంది. ఇలాంటి తరుణంలో సెలవులకు బయటకు వెళ్లాలని అనుకుంటున్నాను నిమ్మగడ్డకు తాజా నోటీసులతో విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.