అమరావతి, జనవరి 10 : లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని సిఎం చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు తొమ్మిదవ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చెప్పిన అంశాలు:
భావనపాడు పోర్టు, రామాయపట్నం పోర్టులు రానున్నాయి
రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు జరుగుతున్నాయి
బుధవారం ఒక్కనాడే లక్ష కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం
రాష్ట్రానికి లక్షా 26వేల ఉద్యోగాలను కల్పించే పరిశ్రమలు రానున్నాయి
ప్రకాశం జిల్లాకు 24,500కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఆసియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ ద్వారా ప్రత్యక్షంగా 4,500మందికి, పరోక్షంగా 12వేల మందికి ఉపాధి అవకాశాలు.
పరిశ్రమ ద్వారా 50వేల రైతులకు లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు.
జన్మభూమి అర్జీలు అన్ని త్వరితగతిన పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు.