అమరావతి: ప్రాంతీయ పార్టీల పోకట దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో జరిగిన హింస ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. అమిష్షాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కన్నా పేర్కొన్నారు. హింస ద్వారా అధికారంలో రావాలని బెంగాల్ సీయం ప్రయత్నిస్తున్నారని కన్నా విమర్శించారు.
దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నేడు ధర్నాకు పిలుపునిచ్చినట్లు కన్నా తెలిపారు. ఎన్నికల సంఘం మమతా బెనర్జీపై చర్యలు తీసుకోవాలని కన్నా కోరారు. తృణమూల్ పార్టీని ఎన్నికల ప్రక్రియ నుండి తప్పించాలని కన్నా డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.