అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మోదీ బాలాజీ దర్శనం కోసం తిరుపతి వస్తున్నారు.
జూన్ తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి తిరుమల చేరుకొని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారని కన్నా తెలిపారు.
ప్రధాని మోది తిరుపతి పర్యటన సందర్భంగా బిజెపి నాయకులు ఘన స్వాగతం పలకాలని కన్నా విజ్ఞప్తి చేశారు.
2014 ఎన్నికల సమయంలో మోది తిరుపతి వచ్చి బహిరంగ సభలో ప్రసంగించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?