Ap Cabinet : ఏపీ క్యాబినెట్ తాజాగా బడ్జెట్ ఆర్డినెన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా బడ్జెట్ ఆర్డినెన్స్ కి ఆమోదం తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో 90 వేల కోట్లతో బడ్జెట్ ఆర్డినెన్స్ కి ఆమోదం లభించింది. తాజాగా ఈ ఫైళ్లను రాష్ట్ర మంత్రులకు సర్క్యులేట్ చేసింది ప్రభుత్వం.
గత ఏడాది కూడా కరోనా వైరస్ నేపథ్యంలో అసెంబ్లీ సభ సమావేశం అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా పరిస్థితి అదే విధంగా పరిస్థితులు ఉండటంతో ఈ బడ్జెట్ కూడా ఆర్డినెన్స్ ద్వారానే గవర్నర్ ఆమోదముద్ర వేయించుకోవడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెలాఖరులోపు గవర్నర్ ఆమోదముద్ర వేసుకున్న తర్వాత ఈ ఆర్డినెన్స్ పై ఆరు నెలల లోపు ఉభయ సభలు సమావేశమై ఆమోదం చేయాల్సి ఉంటుంది.