అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ ఉత్తర్వులు ఇచ్చారు. 13వ తేదీ కాకుండా 12వ తేదీ ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం అవుతుందని పేర్కొన్నారు.
అంతకుముందు 17: 49 గంటలు:
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈనెల 13న జరగనుంది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టు అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తమ తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈనెల 11వ తేదీ సాయంత్రంలోగా పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
రాజధాని అనేది రాష్ట్రం ఇష్టం అని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు శాసనమండలి రద్దు తీర్మానం, హైకోర్టులో కేసులు, రైతుల నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలు, సచివాలయం తరలింపు, సీఎంవో, ఇతర కార్యాలయాల తరలింపు, నవరత్నాల అమలు, ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అంశాలను కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవసరం ఉంది. ఉగాది నుంచి విశాఖ వేదికగా పరిపాలన చేయాలని సీఎం జగన్ సిద్దమవుతున్నారు.