Ap Cabinet Meeting: దాదాపు చాలా నెలల తర్వాత ఏపీ క్యాబినెట్ సమావేశం నేడు జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాక్ లో సమావేశమయ్యారు. ఉదయం ప్రారంభమైన కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఈ నేపథ్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీలో కూడా ఘరానా వ్యాప్తి పెరుగుతూ ఉండటంతో వ్యాక్సినేషన్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కొరత ఉండటంతో..సకాలంలో వ్యాక్సిన్ రాని పరిస్థితి ఏర్పడటంతో ప్రధానికి లెటర్ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అదేవిధంగా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 45 సంవత్సరాలు పైబడిన వారికి.. ముందుగా వ్యాక్సిన్ అందించాలని ఏపీ కేబినెట్ డిసైడ్ అయింది. అంతేకాకుండా కరోనా చికిత్స విషయంలో.. కీలక ఘట్టమైన ఆక్సిజన్ కొరత రాష్ట్రంలో ఏర్పడకుండా ప్రత్యేకమైన చర్యలు ముందుగానే తీసుకోవాలని మంత్రి మండలి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, వ్యాక్సినేషన్పై తీసుకుంటున్న చర్యలపై కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూరే రీతిలో రైతు భరోసా కోసం రూ .3,030 కోట్లకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైయస్ఆర్ ఉచిత భీమా పథకానికి రూ .2,589 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యింది. వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకారులకు 10 వేల ఆర్థిక సహాయం అందించాలని .. నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.