అమరావతి, జనవరి 11: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుకను ప్రకటించారు. ప్రస్తుతం అందజేస్తున్నపింఛన్లను నెలకు రెండువేల రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. జనవరి నెలతో కలిపి పెంచిన పింఛన్లను ఫిబ్రవరిలో మూడు వేల రూపాయలు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
నెల్లూరు జిల్లా బోగోలులో శుక్రవారం జరిగిన జన్మభూమి సభలో ఆయన కానుకను వెల్లడించారు. అదేవిధంగా ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పెంచిన పింఛన్ల వల్ల 54 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. 2014 ముందు పింఛను కేవలం 200 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం 1000 రూపాయల వంతున పింఛన్లను అందజేస్తున్నారు. పింఛన్లను రెండు వేల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వికలాంగులు, వృద్దులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేస్తోంది.
previous post