అమరావతి: అధికారుల బదిలీలు, ఐటి దాడులకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి బ్లాక్ ఎదుట మెట్లపై బైఠాయించి నిరసన తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. నిరసనతో ఎన్నికల కమిషన్ తీరులో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు కంభంపాటి, వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్, కుటుంబరావులు నిరసనలో పాల్గొన్నారు.
అంతకు ముందు చంద్రబాబు సచివాలయంలో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ద్వివేదేకి చంద్రబాబు తొమ్మిది పేజీల వినతి పత్రం అందజేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?