NewsOrbit
రాజ‌కీయాలు

కేంద్ర మంత్రికి సీఎం జగన్ ఘాటు లేఖ.. ఏం రాశారంటే..!

ap cm jagan strong reply to central minister

ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు రాజుకుంటున్నాయి. విభజన సమయం నుంచీ ఉన్న సమస్యలకు కొత్త ప్రాజెక్టుల విషయంలో వస్తున్న సమస్యలను ఇద్దరు సీఎంలు ఓ కొలిక్కి తీసుకురావడం లేదు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తోంది. కేంద్రం కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లొద్దని ఏపీకి లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించింది. దీనికి సీఎం జగన్ కేంద్ర మంత్రికి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టులు కొత్తవి కాదని.. గతంలోనే ప్రతిపాదించినవని రాశారు. మా వాటా జలాలనే మేము వాడుకుంటున్నామని కూడా రాశారు. ఇంతకీ జగన్ రాసిన లేఖలో ఏముందంటే..

ap cm jagan strong reply to central minister
ap cm jagan strong reply to central minister

కేంద్రమంత్రికి జగన్ రాసిన లేఖ సారాంశమిదే..

‘రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న కేంద్రం రాసిన లేఖ సరికాదు. సమావేశంలో రాష్ట్రం తరఫున మాట్లాడేందుకు అజెండా కూడా ఖరారు చేశాం. కృష్ణా ట్రైబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చెప్పింది. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు ఏపీలో కొత్తవి కాదు. కృష్ణా ట్రిబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయి. 2015లో కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య అంగీకారం కుదిరింది. కృష్ణా నదీ నీటి పంపకాల్లో తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించడంతో పాటు సమర్థంగా కాల్వల వ్యవస్థను వినియోగించుకోవడమే జరుగుతుంది. దీని వల్ల ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదు’.

‘నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగదు. పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా వినియోగానికే ఎత్తిపోతల ప్రాజెక్ట్. కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, దిండి ఎత్తిపోతలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలై ఉంది. ఆ రెండు ప్రాజెక్టులు  తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయి. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్‌ కౌన్సిల్‌ తెలంగాణను ఆదేశించలేదు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావిస్తున్నాం’ అని జగన్ తన లేఖలో ప్రస్తావించారు. గడచిన ఆరేళ్లలో ఇవే వివాదాలు నడుస్తున్నాయి. మరి ప్రస్తుతం ఇవి ఎలా టర్న్ తీసుకుంటాయో చూడాల్సి ఉంది.

author avatar
Muraliak

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk