అమరావతి: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన ఎస్విబిసి ఛానల్కు సంబంధించి అన్ని విభాగాల్లో వేలుపెడుతూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైర్మన్ పృద్వి అధికారాలకు సైలెంట్గా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యాంకర్ స్వప్న, సినీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిలను ఎస్విబిసి డైరెక్టర్లుగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నియమించిందని అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా పృద్వి అధికారాలకు చెక్ పెట్టినట్లేనని భావిస్తున్నారు.
కమెడియన్గా 30 ఇయర్స్ తెలుగు ఇండ్రస్టీలో పృద్వి ఎన్నికల సమయంలో వైసిపి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత టాలివుడ్ పెద్దలపైనా పృద్వి విమర్శలు గుప్పించారు. జగన్ సిఎం అవ్వడం టాలివుట్ పెద్దలకు మింగుడుపడటం లేదనీ, అందుకే ఎవరూ వచ్చి శుభాకాంక్షలు కూడా చెప్పలేదనీ తీవ్ర స్థాయిలో పృద్వి విమర్శించారు. అయితే తనను సినిమా ఇండ్రస్ట్రీలో అవకాశాలు ఇవ్వడం లేదంటూ పృద్వి వైసిపి పెద్దల వద్ద మొరపెట్టుకోవడంతో ఆయనకు ఎస్విబిసి చైర్మన్ పదవి లభించింది. చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకొని పృద్వి టాలివుడ్లో ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి.
పృద్వి చైర్మన్గా ఉన్నప్పటికీ డైరెక్టర్లుగా స్వప్న, శ్రీనివాసరెడ్డి నియమితులు కావడంతో కీలక నిర్ణయాల్లో వీరిదే పైచేయి అవుతుందని భావిస్తున్నారు. నూతనంగా నియమించిన ఇద్దరు డైరెక్టర్లలో తెలంగాణకు చెందిన సినీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డికి అవకాశం లభించడం మరో విశేషం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?