Breaking News: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 14వ తారీఖున పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ పోలవరం ప్రాజెక్టు పనులు గత కొంతకాలంగా శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో పనులను పరిశీలిస్తున్న సీఎం జగన్ అనుకున్న టైమ్ లో పూర్తి చేయాలని దృడ సంకల్పంతో .. పోలవరం విషయంలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా గత కొంత కాలం నుండి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. తాజాగా పరిస్థితులు బయట మారటంతో ఈనెల 14వ తారీఖున పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి నిర్ణయించుకున్నారు.
పోలవరం పనులు పరిశీలించిన అనంతరం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాడానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పోలవరం పర్యటన కు సంబంధించి పనులు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించి అధికారులతో జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్ నారాయణరెడ్డి మిగతా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం కావడం జరిగింది.