అమరావతి: రాజధాని మారిస్తే జగన్ రాజకీయ పతనం ఆరంభం అయినట్లేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. విపక్షాలు అన్నీ టిడిపి అధినేత చంద్రబాబు ట్రాప్లో పడ్డాయని మంత్రి కన్నబాబు అనడాన్ని ఆయన తప్పుబట్టారు. 1953లోనే విజయవాడ రాజధానిగా ఉండాలని తమ పార్టీ నేతలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్నీ జగన్కే తెలుసు అన్నట్లు వ్యవహరిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు.
మూడు రాజధానులని జగన్ ప్రకటించినా వైసిపి ఎమ్మెల్యేలు గుడ్డిగా అంగీకరించారని అన్నారు. నమ్మకంతో గెలిపించిన ప్రజలను జగన్ మోసం చేశాడని రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికల సమయంలో మూడు రాజధానులని ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు.