(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమరావతి రాజధానిపై వివాదం సృష్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు.అమరావతి రైతుల ఆందోళనలకు మద్దతుగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం లేదన్న ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా అమరావతి రైతులు వీధులపాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైపవర్ కమిటీ విజయవాడ బస్టాండ్లో సమావేశాలు నిర్వహిస్తోందనీ, రాష్ట్ర రాజధాని బతుకు చివరకు బస్టాండ్ అయ్యిందని రామకృష్ణ విమర్శించారు.