అంతా అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని, సర్వీస్ నిబంధనలను సవరిస్తూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను, హైకోర్టు రద్దు చేయడం పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఏపీ సర్కార్ దాఖలు చేసింది.
అదేవిధంగా రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి. కనగరాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇవ్వటం పెద్ద సంచలనంగా మారింది. దీంతో నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిన తీర్పును న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.