Flash News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహమ్మారి కరోనా వైరస్ ని అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో విధించిన లాక్డౌన్ సమయం ఈరోజుతో ముగియడంతో .. తాజాగా కరోనా సమీక్ష సమావేశంలో సీఎం జగన్ కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్ పదవ తారీకు వరకు రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో రోజుకి దాదాపు పాతిక వేలు కేసులు కొత్తవి నమోదయ్యే పరిస్థితి ఉన్న సమయంలో కర్ఫ్యూను అమలు చేయటంతో.. ఫలితాలు ఇస్తూ కేసుల సంఖ్య 13 వేలకు చేరుకుంది. దీంతో ఇదే కర్ఫ్యూ రాష్ట్రంలో పది రోజులు అమలు చేస్తే పరిస్థితి మారే అవకాశం ఉంది అని ప్రభుత్వం భావించి.. జూన్ 10 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే తరుణంలో గతంలో మాదిరిగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపు సమయం యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేయడం జరిగింది.
Read More: Ap Tenth Exam’s: ఏపీలో వాయిదా పడ్డ పదవ తరగతి పరీక్షలు..!!