(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదం అవుతున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి వారి రధం దగ్ధం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఘటనపై హిందూ సంఘాలు, బీ జే పీ, జనసేన, విహెచ్పీ పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేస్తుండటంతో పాటు జ్యూడిషియల్ విచారణ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ సీ బీ ఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతర్వేది ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ సి బి ఐతో విచారణ జరిపించాలని నిన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నేడు జీవో విడుదల చేసింది.
వివిధ హిందూ సంఘాలు, బీజేపీ, జనసేన ఆందోళనల నేపథ్యంలో అంతర్వేదిలో సెక్షన్ 30పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీ బీ ఐ దర్యాప్తులో వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తాయని రాజకీయ పక్షాలు, హిందూ సంఘాలు భావిస్తున్నాయి.