ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ ని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో పెట్టుబడులు రావడంలేదని పారిశ్రామిక రంగం వెనకబడి పోయిందని ఇటీవల టీడీపీ అదేవిధంగా మిగతా పార్టీల నేతలు వరుసగా విమర్శలు చేస్తూ ఉన్న తరుణంలో తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు ఏ రీతిలో కొత్త పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి అన్న దానిపై ఓ జాతీయ పత్రిక లిస్ట్ రిలీజ్ చేసింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక తయారీ రంగంలో రెండో స్థానంలో ఉన్నట్లు స్పష్టం చేసింది. కొత్త పెట్టుబడులు ఆకర్షణలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉండగా రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు పేర్కొంది. గత మూడు నెలల్లో అనగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 30 వేల కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు ఈ పత్రిక కథనం తెలిపింది.
మరోపక్క ప్రతిపక్షాలు జగన్ వచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు రావడంలేదని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంటే వాటికి అనుకూలంగా ఉండే మీడియా కూడా అదే రీతిలో వార్తలు ప్రసారం చేస్తూ ఉండగా.. జాతీయ మీడియా మాత్రం ఏపీ లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతున్నట్లు తెలపటం గమనార్హం. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టే వారికి సింగిల్ విండో డిస్క్ తరహాలో జగన్ సర్కార్ అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో .. చాలా వరకు పెట్టుబడులు వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా ఈమధ్య కొద్దిగా గ్యాప్ వచ్చినా గానీ.. తాజాగా మళ్లీ పారిశ్రామిక రంగం పుంజుకుంటున్నట్లు వైసీపీ శ్రేణులు తెలుపుతున్నాయి.