అమరావతి, జనవరి 30: కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా, ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమైయాయి. ఈ సందర్భంగా ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు..
- రాష్ట్ర విభజన నష్టాల నుండి కొలుకుని అభివృద్ధి పథంలో పయనిస్తుంది.
- నాలుగేళ్లలో విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా అమలు కాలేదు.
- అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
- వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 11శాతం వృద్ధి రేటు నమోదు చేశాం. అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైంది. అనేక రంగాల్లో ఇప్పటికే సంతృప్తి స్థాయి సాధించాం.
- మౌళిక, సేవా రంగాల్లో రాష్టం దూసుకువెళుతుంది.
- ఎన్టిఆర్ భరోసా పింఛన్ మొత్తాన్ని 1000 రూపాయల నుండి రెండు వేలకు పెంచాం. త్రీ వీలర్ వాహనాలకు పన్ను మినహాయింపు ఇచ్చాం.
- కేంద్రం అగ్రవర్ణ పేదలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం రిజర్వేషన్ను ఒక్క కాపులకే ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
- స్వయం సహాయక బృంద సభ్యులకు పదివేలు కూడా మంజూరు చేస్తున్నాం.
- నవ్యాంధ్ర నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
- కేంద్రం సకాలంలో నిధులు అందించకున్నా, ప్రభుత్వం నిర్మాణాలను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
- గడచిన నాలుగేళ్ల వ్యవధిలో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిపై పది శ్వేతపత్రాలను ఇటీవల విడుదల చేసిన విషయాన్ని గవర్నర్ నరసింహన్ గుర్తు చేశారు.
- రాష్ట్రంలో మూడు కొత్త ఎయిర్ పోర్టులు నిర్మిస్తున్నాం.
- రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తాం.
- రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేస్తాం.
- ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెడుతున్నాం, రెండు వేల డయాలసిస్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నాం.
- వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.
- ఫిషరీస్ సెక్టార్ 33శాతం అభివృద్ధి సాధించింది.
- ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
- కియా కార్ల ఫ్యాక్టరీ రాకతో అనంతపురం జిల్లా రూపు రేఖలు మారనున్నాయని నర్సింహన్ అన్నారు.
- 2029 నాటికి నెంబర్ ఒన్ రాష్టంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ఆయన అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?