అన్ని పక్షాల అనుమతులు లేకుండా.. ఏకాభిప్రాయం లేకుండా రాజధాని నిర్ణయం తీసుకుంటే ఎదురయ్యే ఇబ్బందులు సీఎం జగన్ కు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశం తెర మీదకు వచ్చిన వెంటనే మొదలైనా ఆందోళనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఓ రాజకీయ పార్టీ చేయిస్తున్న విమర్శలు అనే ముద్ర పడినా రైతులు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎదురుగాలిని తట్టుకుని విశాఖ వెళ్దామని ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో విశాఖలో కూడా వివాదాలు ఎదురువుతున్నాయి. విశాఖలో తలపెట్టిన మొదటి భవన నిర్మాణంలో పరిపాలనకు ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
విశాఖలో పనులు ప్రారంభమయ్యాయా..?
విశాఖకు రాజధాని తరలింపులో అడ్డంకులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వేరే పద్థతుల్లో నిర్మాణాలకు సిద్ధమవుతోంది. ‘వీవీఐపీ, వీఐపీ గెస్ట్ హౌస్’ పేర్లతో నిర్మాణాలు చేపట్టడానికి ఈనెల 16న భూమి పూజ కూడా జరిగిందని తెలుస్తోంది. పరిపాలనా భవనాలు నిర్మిస్తారని చెప్తున్న భీమిలీ నియోజకవర్గంలోని కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్ హిల్స్ లో వీటిని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇది ఒక కొండ ప్రాంతం. ఓపక్క సముద్రం, మరో వైపు పచ్చని ప్రకృతి. ఈ కొండపై 30 ఎకరాల్లో భవనాలు నిర్మించాలని భావిస్తోంది. అతిధిలకు అన్ని వసతులు ఒకేచోట లభించేలా.. బిల్డింగ్ బ్లాకులు, మూమెంట్ నెట్ వర్క్, జోనింగ్, కీ కంపోనెంట్స్, యుటిలిటీలస్, పార్కింగ్ ఏరియా, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ స్కేపింగ్ ఉండేలా నిర్ణయించారు. ఇందుకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి డిజైన్లు ఇచ్చి.. తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని కూడా సంకల్పించారు. ఇక్కడి నుంచి ఎయిర్ పోర్టు 30 కిమీ ఉంటుంది.
అప్పుడే అడ్డంకులు మొదలయ్యాయి..
విశాఖలో నిర్మాణం తలపెట్టిన స్థలం బుద్దిస్ట్ స్థలమనీ.. అక్కడ ఎటువంటి నిర్మాణాలు తలపెట్టొద్దంటూ కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఏపీ సీఎస్ కు లేఖ రాశారు. క్రీస్తు పూర్వం మూడో శతాబ్బానికి చెందిన స్థలమనీ.. పురావస్తు శాఖకు చెందిన అంశాలు ఆ స్థలంతో ముడిపడి ఉన్నాయని ఆ లేఖలో ప్రస్తావించారు. 2016లో కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీంతో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మొదటి భవనం విషంయంలోనే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతోంది. కాదని.. ప్రభుత్వం ముందుకెళ్తే మళ్లీ ఈ అంశం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వానికి మొదటి అడుగులోనే తలనొప్పులు రావొచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?