Big Breaking: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మూడు రాజధానుల అంశం. టీడీపీ హయాంలో రాజధానిగా ప్రకటించిన అమరావతిని కలుపుతూ.. వైసీపీ ప్రభుత్వం మరో రెండు ప్రాంతాలను కలిపి మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వివాదం చెలరేగింది. వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు దాదాపు రెండేళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఈ కేసు నడుస్తోంది. అయితే.. అనూహ్యంగా ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ లో వెనక్కు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఈ బిల్లును ప్రవేశపెడుతోందని తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాల్లోనే..
మూడు రాజధానుల బిల్లుపై రగడ కొనసాగుతున్నా ప్రభుత్వం ముందుకే వెళ్లింది. విశాఖపట్నంలో కార్యాలయాలు సైతం ఇందుకు అన్వేషించింది. ఎప్పటికప్పుడు మంత్రులు, వైసీపీ ముఖ్యనేతల నుంచి.. ‘ఏ క్షణానైనా విశాఖకు రాజధాని తరలింపు’ అనే ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే.. ఈ బిల్లును వెనక్కి తీసుకుంటున్నటు హైకోర్టుకు విన్నవించి సంచలనం రేపింది. అనంతరం.. అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించింది. ఇప్పుడు ఇందుకు ముహూర్తం కుదిరిందని సమాచారం. మార్చి మొదటి వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కారణంగా శీతాకాలపు సమావేశాలు కూడా సరిగా నిర్వహించని కారణంగా ఈసారి దాదాపు వారం నుంచి 15 రోజులు నిర్వహాంచాలని భావిస్తోంది.
పార్టీలు, రైతులు మాట ఇదే..
ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అయితే.. ఈసారి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని మార్పును రాజకీయ పార్టీలేవీ అంగీకరించడం లేదు. భూములిచ్చిన రైతులు కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం అనేది ప్రభుత్వానికి సవాల్ గా మారింది. అసలు.. రాజధాని మార్చేందుకే వీల్లేదని అంటున్న వర్గాలను ప్రభుత్వం నిజంగా ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్నా ఒప్పంచడం కష్టమే. మరి.. తన ముందున్న క్లిష్టమైన సమస్యను ప్రబుత్వం ఎలా ఎదుర్కొంటుందో.. రాజధానిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?