AP High Court : పురపాలక సంఘ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని ఓ పక్క టీడీపీ ఆరోపిస్తోంది. మరో పక్క ఫోర్జరీ సంతకాలతోనూ అధికార పార్టీ నేతలు..
టీడీపీ అభ్యర్థుల నామినేషన్ లను విత్ డ్రా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వివాదం హైకోర్టుకు చేరింది.
చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. 18 డివిజన్ లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ లను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరణలు చేశారంటూ పిటిషన్ వేశారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ ను 18 మంది టీడీపీ అభ్యర్థుల తరపున న్యాయవాది కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లపై సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?