విశాఖపట్నం : విశాఖ ఎయిర్పోర్టులో నిన్న జరిగిన పరిణామాలపై ఏపీ హైకోర్టు విచారించింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పోలీసుల తీరుపై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు అనంతరం వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. అధికారపక్షానికి ఒక రూల్, ప్రతిపక్షానికి మరో రూల్ ఉంటుందా, చట్టం ముందు అందరూ సమానమే కదా అని హైకోర్టు ప్రశ్నించింది.
ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎయిర్పోర్టుకు రాకుండా వాళ్లని ఎందుకు నిలువరించలేకపోయారు అని హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే నెల 2న కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీని హైకోర్టు ఆదేశించింది. అదే రోజే విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొన్నది.