అమరావతి: దిశ హత్యాచార కేసు నిందితులు ఎన్కౌంటర్కు గురి అవ్వడంపై ఏపి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్| ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.’ అన్న భగవద్గీత స్లోకాన్ని మంత్రి సుచరిత ట్వీట్ చేశారు.
సజ్జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మ సంస్థాపన కోసం..ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను’ అనేది ఆ శ్లోక తాత్పర్యం.
దిశ నిందితుల ఎన్కౌంటర్ను తాను సమర్ధిస్తున్నానని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. దిశకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకూ జరగకూడదని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్నేర్పించాలని ఆయన సూచించారు.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
— Mekathoti Sucharitha (@SucharitaYSRCP) December 6, 2019