విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ర్ట టూరిజం శాఖమంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖలో నిన్న చంద్రబాబు పర్యటనను ప్రజలు, మహిళలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు సి ఆర్ పీ సి 151 సెక్షన్ కింద నోటీస్ అందజేసి అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపించారు. వైసీపీ శ్రేణులే చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, మూడు రాజధానుల ప్రతిపాదనకు చంద్రబాబు వ్యతిరేకిస్తున్నందున ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చూపించారని వైసీపీ వారు పేర్కొంటున్నారు.
పులివెందుల నుంచి రౌడీలను రప్పించి దాడి చేయించారని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పు పట్టారు. ఎక్కడి నుండో మనుషులను తీసుకురావాల్సిన పని తమకు లేదని అవంతి అన్నారు.
బయట నుంచి రౌడీలు వచ్చారని నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని చంద్రబాబుకు అవంతి సవాల్ విసిరారు. బయట నుండి రౌడీలు వచ్చారని నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని పేర్కొన్నారు. పోలీసులు, మహిళల పట్ల చంద్రబాబు తీరు దారుణంగా ఉందని అన్నారు. ధర్నాలో పాల్గొన్న వారందరూ స్వఛ్చందంగా వచ్చారని చెప్పారు. లోకేష్ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు పట్ల ఆగ్రహంగా ఉన్నారని, ప్రజల మనోభావాలను చంద్రబాబు గౌరవించాలని కోరారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?