2019 సార్వత్రిక ఎన్నికలలో వైసిపి పార్టీ తరపున పోటీ చేసిన వారు ఎక్కువగా యువతే. 50 ఏళ్ల లోపు వారికి టికెట్లు ఇచ్చి జగన్ పోటీలో దింపి గెలిపించుకోవడం జరిగింది. దీంతో వైసిపి పార్టీ యంగ్ అండ్ డైనమిక్ యూత్ పార్టీ అనే టాక్ గట్టిగా వినబడింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఆ పార్టీలో ఉన్న యువ నేతలకు ప్రోత్సాహం కలిగించే రీతిలో పార్టీ తరఫున పదవులు ఇస్తూ వస్తోంది. జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా చాలా వరకు యువకులే పైగా 60 శాతం గ్రాడ్యుయేట్ చదువు కలిగినవారు.
ఈ విధంగా వైసిపి హైకమాండ్ యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మాత్రం కుర్ర నాయకులను తొక్కేస్తున్నట్లు.. వాళ్లకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నట్లు ఆ జిల్లాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా యువత తన దగ్గరికి రాకుండా చూసుకుంటున్నారని యువతకు ఏం తెలుసు అనే విధంగా సదరు మంత్రి వ్యవహరిస్తున్నట్లు ఇటీవల వార్తలు పార్టీ లో వైరల్ అవుతుంది.
ముఖ్యంగా రెండు రోజుల పాటు సీఎం జగన్ తిరుమల పర్యటన లో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లరు వైయస్ జగన్. దీంతో చిత్తూర్ జిల్లాలో ఉన్న యువ నాయకులు ఎమ్మెల్యేలు కలవాలని ప్రయత్నించినా …. ఈ మంత్రి మాత్రం వారిని జగన్ ని కలవకుండా దూరంగా ఉంచారు అనే టాపిక్ జిల్లాలో నడుస్తుంది. జిల్లాకు చెందిన దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు జగన్ని కలవాలని నిర్ణయించుకున్నారట.
తమ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను చెప్పుకోవాలని ఈ యువ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా సదరు మంత్రి మాత్రం వారిని ఎట్టి పరిస్థితిలో కలవకుండా చేశారట. దీంతో వీళ్లంతా ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద గెలిచిన ఎమ్మెల్యే అయినా గాని సదరు మంత్రి వారిని జగన్ నీ కలవకుండా చేస్తున్నారంటే ఆయనకు పార్టీ పై ఎంత ఉందో అంటూ చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నయి.